ఆసియాకప్ తొలి మ్యాచ్లో లంక పేసర్ మలింగా మ్యాజిక్ చేశాడు. పాకిస్థాన్పై చివర్లో నిప్పులు చెరగడంతో లంక 12 పరుగుల తేడాతో టోర్నీలో బోణీ చేసింది. ఈ మ్యాచ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి..
ఒక మ్యాచ్లో 250 పరుగులకు పైగా లక్ష్యం ఉన్నప్పుడు పాకిస్థాన్ ఓడిపోవడం ఇది 12వ సారి కావడం విశేషం.
మలింగా వన్డేల్లో ఆరోసారి 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. అయితే 61 వన్డేల తరువాత మలింగా మల్లీ ఈ ఫీట్ సాధించాడు. భట్టి వికెట్ తీసిన వెంటనే అతడు ఈ అరుదైన మైలురాయికి చేరాడు.
250 వికెట్లు తీసిన నాలుగో శ్రీలంక బౌలర్గా మలింగా రికార్డుల్లో నిలిచాడు.
163 వన్డేల్లో మలింగా ఈ ఫీట్ సాధించాడు. ముత్తయ్య మురళీ ధరన్ 174 మ్యాచ్ల్లో 250 వికెట్లు తీశాడు. ఇప్పుడు మురళీ రికార్డును మలింగా బ్రేక్ చేశాడు.
తిరిమన్నె- సంగక్కర రెండో వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాక్పై లంక తరపున రెండో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో సమరవీరా-గురుసింహా జోడి 1992లో ముల్తాన్ వేదికగా జరిగిన వన్డేలో… రెండో వికెట్కు 157 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓవరాల్గా శ్రీలంక తరపున రెండో వికెట్కు 150కు పైగా పరుగులు చేయడం ఇది పదమూడోసారి.
ఉమర్ అక్మల్ తన కెరీర్లో 18వ ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రీలంకపై అతడికి ఇది ఏడో అర్థ సెంచరీ.
మిస్బా-ఉల్-హక్ తన వన్డే కెరీర్లో 36వ అర్థ సెంచరీ చేశాడు. ఇందులో 16 అర్థ సెంచరీలు 2013 నుంచి 2014 మధ్య కాలంలో చేసినవే. ఈ సీజన్లో ఇన్ని అర్థ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ మిస్బా ఒక్కడే కావడం విశేషం. ఓవరాల్గా లంకపై మిస్బా 9 అర్థ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి మహేల జయవర్ధనే 600 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. సచిన్ 664 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ జయవర్థనే.
అమ్మ తరువాత నాకు అన్నీ తానైంది నా భార్యే... అందుకే ఆమె కోసం నా ఆలోచన... అడుగులో అడుగు వేసింది... ఆలోచనలనే మార్చేసింది... ఆనందాన్ని నింపేసింది... అదృష్టమై నా రాత మార్చింది... అన్నింటా తోడు నీడైంది... అందరి చేత పొగిడించుకొనేలా చేసింది… అదే నా సుమన… అందుకే ఆమెకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
గంభీరమేమైంది... క్లాసిక్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ... ఒకప్పుడు టీమిండియాలో పర్మినెంట్ మెంబర్ . 2011 వరల్డ్ కప్ వరకు అతడి ప్లేస్ కు తిరుగులేదు . ఎన్నోసార్లు భారత జట్టుకు శుభారంభాలు అందించాడు . కేవలం అంతర్జాతీయ మ్యాచ్ ల్లో నే కాదు .. IPL ల్లోనూ గంభీర్ దూకుడు కొనసాగించాడు . 2012 తో కోల్ కతా జట్టును ఛాంపియన్ గా నిలిపాడు . మరి ఇప్పుడు ఆ గంభీరమేమైంది... క్లాసిక్ బ్యాట్స్ మన్ గా ... మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు పొందిన గౌతి భారత జట్టుకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించాడు . టెస్టు , వన్డే , టీ 20 మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు . 2011 వరకు గంభీర్ మెన్ ఇన్ బ్లులో శాస్వత సభ్యుడిగా కొనసాగాడు . తరువాత అతడి ఫేట్ మారింది . ధోనీతో విబేధాలు ... వ్యక్తిగత ప్రవర్తన .. ఫాం లేమితో టీమిండియాకు దూరమయ్యాడు . భారత జట్టులో చోటు కోల్పోయినా ... కోల్ కతా కెప్టెన్ గా ఐ . పి . ఎల్లో తనదైన ముద్ర వేశాడు . ఇప్పుడు ఐ . పి . ఎల్లోనూ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు . ఈ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ...
మా ఇంట పంచవసంతం చిన్ని తండ్రి నిన్ను చూడగ.. వేయి కళ్లైనా సరిపోవురా.. అన్ని కళ్లూ చూస్తుండగా.. నీకు దిష్టంతా తగిలేనురా.. ఓ సినీ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రీ.. తన బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాటలు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒకటి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి తరువాత.. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్టక ముందు..ఆశ్రిత్ పుట్టిన తరువాత.. (వాడి మొదటి అడుగులు ) ఏంటి అంత స్పెషల్ అంటరా.. మా ఇంట్లో వ...
జాబిలి జస్ట్ మిస్ జాబిలి .. అందినట్టే అంది జస్ట్ మిస్ అయ్యింది. సక్సెస్ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్-2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరికొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకుండా పోయింది. చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో ముని...
Comments
Post a Comment